Farmer protests Updates: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న నిరసనలు 33వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో తీవ్రమైన చలిలో రైతులు తమ ఆందోళన (Farmer protests) ను కొనసాగిస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 30న (బుధవారం) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో చర్చ‌ల‌కు రైతు సంఘాల ప్రతినిధులు హాజరుకావాలని సోమవారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది. అయితే రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. చర్చలకు రావాలని (Farmer union leaders) కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ముందు వారితో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర మంత్రులు స‌మావేశం కానున్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


అంతకుముందు రైతులు, కేంద్రం (Central Govt) మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాల్లో తమకు మార్పులు అవసరం లేదని.. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం సూచిస్తూ వస్తోంది. Also Read: PM Narendra Modi: తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook