Former PM Manmohan Singh health condition: న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌కి ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌లో వైద్య నిపుణుల సమక్షంలో చికిత్స జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్‌కి చెక్ పెట్టాలంటే కొవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 vaccine) తయారీదారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా అధిక సంఖ్యలో ప్రజలకు, ముఖ్యంగా అత్యవసరమైన వారికి వ్యాక్సినేషన్ చేయించాలని విజ్ఞప్తి చేస్తూ నిన్నటి ఆదివారమే ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) ఓ లేఖ రాశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman


ప్రజా శ్రేయస్సు దృష్ట్యా COVID-19 patients కోసం, దేశ పౌరుల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మరునాడే డా మన్మోహన్ సింగ్ (Manmohan Singh health updates) ఇలా కరోనా బారినపడటం పార్టీ శ్రేణులతో పాటు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook