బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. వెండి ధర సైతం బంగారం దారిలోనే నడిచింది.  హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న ఉదయం రూ.220 మేర పెరిగిన ధర సాయంత్రానికి రూ.280 ధర తగ్గడంతో మార్కెట్ ముగిసింది. నేటి ఉదయం రూ.10 మేర అతి స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,480 వద్ద ట్రేడ్ అవుతోంది. అమరులైన 20 మంది జవాన్ల పేర్లు, వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో నిన్న సాయంత్రం రూ.210  పెరగడంతో మార్కెట్ ముగిసింది. నేటి మార్కెట్‌లో అతి స్వల్పంగా రూ.10 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,420గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,210 వద్ద కొనసాగుతోంది. లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి


జూన్ తొలి వారంలో బులియన్ మార్కెట్‌లో ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత ఓ మోస్తరు ధరలు నమోదు చేస్తున్నాయి. నిన్న ఉదయం రూ.600 మేర భారీగా ధర పెరగగా సాయంత్రానికి రూ.700 మేర తగ్గింది. నేటి ఉదయం మాత్రం కేవలం రూ.10 పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,610 వద్ద ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ