హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సనోరాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండమీద నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన  పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఇదిలా ఉండగా బారాబంకీలో గత రాత్రి పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. వర్షాల కారణంగా ఓ చెట్టు విరిగి పట్టాలపై పడింది. రైలు చెట్టుమీద నుంచే పోవడంతో అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది.