కరోనా వైరస్( Corona virus ) నుంచి ముప్పు ఇంకా తొలగనే లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రాణాంతక క్యాట్ క్యూ వైరస్ ( Cat que virus ) ప్రమాదం భారత్ కు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా..రోజురోజుకూ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో వైరస్ ముప్పు భారత్ కు పొంచి ఉందని తెలుస్తోంది.  ఈ వైరస్ కూడా చైనా ( Another virus from china ) నుంచి వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఇప్పటికే చైనాతో పాటు పొరుగుదేశం వియత్నాంలో అనేకమందికి సోకిన ఈ క్యాట్ క్యూ వైరస్ ఇప్పుడు ఇండియాకు వ్యాప్తి చెందే అవకాశముందని భారతీయ వైద్య పరిశోధన మండలి ( ICMR ) హెచ్చరిస్తోంది. ఐసీఎంఆర్ తాజా హెచ్చరికలు భారత్ లో ఆందోళన పుట్టిస్తున్నాయి. సీక్యూవీగా పిలుస్తున్న ఈ వేరస్...క్యూలెక్స్ జాతి దోమలు, పందుల్ని తమ వాహకాలుగా మార్చుకుంటుందనే విషయం చైనా , తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందని...ఇండియాలో వ్యాప్తి చెందవచ్చని ఐసీఎంఆర్ చెబుతోంది. 


ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ప్రకారం ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్ లలో ఒకటి  సీక్యూవీ. ఇది మనిషిలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లల్లో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు.   ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకవచ్చు. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ ( NIV-PUNE ) శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాపు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా..వారందరిలో సీక్యూవి యాంటీ బాడీస్ ( CQV Anti bodies ) కన్పించాయి కానీ వైరస్ లక్షణాల్లేవు. దాంతో కొంతమందగి వ్యాధికి గురయ్యే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మరి కొంతమంది శాంపిల్స్ కూడా పరీక్షించాల్సిన అవసరముందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.  2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ పాజిటివ్ గా తేలింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. Also read: Amnesty International: ఇండియాలో కార్యకలాపాలు నిలిపివేత