డ్రాగన్ కంట్రీ చైనాకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి చైనా దేశపు యాప్‌లపై బ్యాన్ విధించింది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లను ఒకేసారి నిషేధించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో లోన్ యాప్‌లతో వేధింపులు పెరగడం, ఆత్మహత్యలు చోటుచేసుకోవడం ఎక్కువైంది. ఇలాంటి యాప్‌లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గత కొద్దికాలంగా పెరుగుతోంది. ఈ తరహా యాప్‌లు వేధింపులకు గురి చేయడమే కాకుండా..గూఢచర్యానికి కూడా పాల్పడుతున్నట్టు సమాచారం. దాంతో కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఇచ్చిన సిఫారసుల మేరకు కేంద్ర ఐటీ శాఖ ఈ యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 232 యాప్‌లలో 138 బెట్టింగ్ యాప్‌లు కాగా, 94 రుణాల యాప్‌లు ఉన్నాయి. లోన్ యాప్‌లలో 94 ఇ స్టోర్‌లో అందుబాటులో ఉండగా..ఇంకొన్ని థర్డ్ పార్టీ లింక్ ల ద్వారా పనిచేస్తున్నాయి.


ఈ యాప్‌లు లోన్ తీసుకున్న వ్యక్తుల్ని అప్పుల్లో బంధించడమే కాకుండా గూఢచర్యం, ప్రచార సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా...దేశ పౌరుల డేటాకు ప్రమాదం కల్గించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.


Also read: PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook