India Coronavirus cases crosses 1-crore mark: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో కోవిడ్ కేసులు కోటి మార్క్‌ను దాటాయి. గతంతో పోల్చుకుంటే కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో శుక్రవారం ( డిసెంబరు 18న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 25,153 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 347  మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599 కి చేరగా.. మరణాల సంఖ్య 1,45,136 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా ( Coronavirus ) నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూ.. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. శనివారం కరోనా నుంచి 29,885 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 95,50,712 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,08,751 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.46 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.  Also read: Covid-19: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఐసీఎంఆర్ చీఫ్‌కు కరోనా


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,71,868 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 18వ తేదీ వరకు దేశంలో మొత్తం 16,00,90,514 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Hathras Case: గ్యాంగ్ రేప్ నిజమే.. సీబీఐ చార్జిషీట్



Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook