India Corona Update: కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాలు కూడా పెరుగుతుండటంతో ఆందోళన ఎక్కువవుతోంది. దేశంలో ఇప్పటివరకూ కరోనా సోకిన రోగుల సంఖ్య 2 కోట్లు దాటడం గమనార్హం. గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 57 వేల 229 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3 వేల 449 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3 లక్షల 20 వేల 289 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ కేసుల సంఖ్య 2 కోట్ల 82 లక్షల 833కు చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కారణంగా 2 కోట్ల 22 లక్షల 408 మంది మరణించారు. అటు 1 కోటి 66 లక్షల 13 వేలమంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34 లక్షల 47 వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 15.89 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో కరోనా రికవరీ రేటు (Corona Recovery Rate) 81.9 శాతం కాగా..మరణాల శాతం 1.1గా ఉంది. 


ఇక తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్తగా 6 వేల 876 కరోనా కేసులు నమోదయ్యాయి. 59 మంది మరణించారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిన్న వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 63 వేలకు పెరిగింది. ఇప్పటివరకు 3 లక్షల 81 వేలమంది కోలుకున్నారు. రాష్ట్రంలో  ప్రస్తుతం 79 వేల 520 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 


Also read: Corona Second Wave: కరోనా వైరస్ సంక్రమణలో కీలకమైన మార్పులు, కొన్ని రాష్ట్రాల్లో నిలిచిన పెరుగుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook