India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. కొంచెం ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు ఈ మహమ్మారి రికవరీల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 85.52 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.54 శాతం, యాక్టివ్ కేసుల రేటు 12.94 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 9న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 73,272 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 926 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,79,424 కి చేరగా.. మరణాల సంఖ్య 1,07,416 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు


దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 59,88,823 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,83,185 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 11,64,018 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 9 వరకు మొత్తం 8,57,98,698 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Harthras Case: హత్రాస్ బాధిత కుటుంబానికి భారీ భద్రత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe