India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకుపైగా నమోదైన కేసులు.. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో గురువారం ( అక్టోబరు 15న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 63,371 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Annapurna Studios Fire accident: అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం.. Video


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,12,161 కి చేరింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 64,53,780 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,04,528 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 87.56 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 10.92 శాతం ఉన్నట్లు వైద్యశాఖ
వెల్లడించింది. 
Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు


ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 10,28,622 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 15 వరకు మొత్తం 9,22,54,927 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe