India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. మళ్లీ పెరిగాయి. చాలా రోజులపాటు 6-7 వందలకే పరిమితమైన మరణాలు.. దేశంలో తాజాగా ఒక్కరోజులో  వేయి మార్క్ దాటాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 88.03 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 10.45 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.  Also read: Navratri Day 2: ‘బాలా త్రిపురసుందరి’గా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24గంటల్లో శనివారం ( అక్టోబరు 17న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 61,871 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,033 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,14,031 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Heavy Rains: హైదరాబాద్‌లో మళ్లీ జల ప్రళయం..


దేశవ్యాప్తంగా శనివారం కరోనాతో 72,614 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 65,97,209 మంది బాధితులు క్యూర్ అయ్యారు. అయితే ప్రస్తుతం దేశంలో 7,83,311 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 9,70,173 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 17 వరకు మొత్తం 9,42,24,190 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Health Tips: గుండెపోటు.. ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe