India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతోపాటు 700లకు చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగానే తగ్గింది. దీంతోపాటు రికవరీ రేటు కూడా రోజురోజుకు భారీగానే పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 89.78 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.51 శాతం, యాక్టివ్ కేసుల రేటు 8.71 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.  Also read: Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 23న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 53,370 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 650 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 78,14,682 కి చేరగా.. మరణాల సంఖ్య 1,17,956 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ


దేశవ్యాప్తంగా శుక్రవారం కరోనాతో 67,549 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 70,16,046 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 6,80,680 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 23 వరకు మొత్తం 10,13,82,564 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe