India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రోజువారీ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 36 వేలకు చేరువలో కేసులు నమోదు కాగా.. 500లకు తక్కువగా మరణాల సంఖ్య నమోదైంది. కరోనా కేసులు పెరగడం ప్రారంభమైన నాటి నుంచి.. మహామ్మారి కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. అయితే ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రికవరీ రేటు కూడా రోజురోజుకు భారీగానే పెరుగుతోంది. గత 24 గంటల్లో సోమవారం ( అక్టోబరు 26న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 36,469 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 488 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,46,429 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,19,502 కి చేరింది. Also read: West Bengal: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దేశవ్యాప్తంగా సోమవారం కరోనాతో 63,842 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 72,01,070 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 6,25,857 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.  ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 90.62 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.50 శాతం, యాక్టివ్ కేసుల రేటు 7.88 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. 


ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 9,58,116 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 26 వరకు మొత్తం 10,44,20,894 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 


 


Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe