India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా రోజురోజుకు గణనీయంగానే పెరుగుతోంది. గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 29న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 48,648 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 563 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: BJP workers murder: బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,88,851 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,21,090 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే దేశవ్యాప్తంగా గురువారం కరోనాతో 57,386 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 73,73,375 కి చేరిందని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,94,386 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. 


ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 91.15 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.50 శాతం, యాక్టివ్ కేసుల రేటు 7.35 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 11,64,648 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 29 వరకు మొత్తం 10,77,28,088 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe