Covid cases in India: దేశంలో గత రెండు రోజులుగా 20వేలకు దిగువనే నమోదైన కరోన కేసులు..తాజాగా ఆ మార్కును దాటాయి. కొత్తగా 22,431 మంది​  వైరస్​ (Covid cases in India)బారిన పడ్డారు. మృతుల సంఖ్య కూడా 300పైనే నమోదైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 14,31,819 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 22,431 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కేసుల్లో 19 శాతం మేర పెరుగుదల కనిపించింది. నిన్న 318 మంది ప్రాణాలు(covid Deaths) కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.49 లక్షలకు చేరింది. అలాగే ఒక్క కేరళ(Kerala Corona deaths)లోనే 12 వేల కేసులు, 134 మరణాలు సంభవించాయి. 



Also read: Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్...బోనస్‌గా 78 రోజుల వేతనం!


ప్రస్తుతం 2.44లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.72 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.95 శాతానికి చేరింది. నిన్న 24,602 మంది కరోనాను జయించారు. ఇప్పటివరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.32 కోట్లకు చేరింది. మరోపక్క బుధవారం 43,09,525 మంది కరోనా టీకా(Testing update for covid-19) వేయించుకున్నారు. నిన్నటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 92,63,68,608కి చేరింది. 


ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,54,944 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 8,242 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,70,56,442కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,39,914కు పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook