India Corona Update: కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య నిలకడగా ఉండగా..కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా పాజిటివిటీ రేటు సైతం తగ్గుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వైరస్(Corona Virus) ఉధృతి తగ్గుముఖం పడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్, కర్ఫ్యూ ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఇంకా తగ్గడం లేదు. కాస్త నిలకడగా ఉందని చెప్పవచ్చు. గత 24 గంటల్లో 1 లక్షా 73 వేల 790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమంయలో 3 వేల 617 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య తగ్గనంతవరకూ కరోనా అదుపులో రానట్టే.


గత 24 గంటల్లో దేశంలో 2 లక్షల 84 వేల 601 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 2 కోట్ల 77 లక్షల 29 వేల 247 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం దేశంలో 22 లక్షల 28 వేల 747 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 2 కోట్ల 51 లక్షల 78 వేలమంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశంలో 3 లక్షల 22 వేల మంది మరణించారు. 


దేశంలో ప్రస్తుతం కరోనా రోగుల రికవరీ రేటు 90.80 శాతంగా ఉంది. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 8.04 శాతంగా ఉంది. మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియలో వేగం అందుకుంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30 లక్షల 62 వేల 747 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 


Also read: Supreme Court: వైఎస్ జగన్ నిర్ణయం..ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook