India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. నిత్యం కేసులతోపాటు కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) కొత్తగా 15,144 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,05,57,985 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,52,274 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. కరోనా (Coronavirus) నుంచి నిన్న 17,170 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా (cured cases) 1,01,96,885 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో (active cases) ప్రస్తుతం 2,08,826 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 96.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతం ఉంది. Also Read: COVID-19 vaccination: తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం


దేశవ్యాప్తంగా నిన్న 7,79,377 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 16 వ తేదీ వరకు మొత్తం 18,65,44,868 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook