India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం 12వేలే నమోదైన కరోనా కేసులు.. మంగళవారం 16 వేలకు చేరువలో నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 12న) కొత్తగా 15,968 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 202 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,04,95,147 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,51,529 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా (Coronavirus) నుంచి నిన్న 17,817 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా (cured cases) 1,01,29,111 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,14,507 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.51 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతం ఉంది. Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే


దేశవ్యాప్తంగా నిన్న 8,36,227 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 12వ తేదీ వరకు మొత్తం 18,34,89,114 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also Read: Venkaiah Naidu: భోగి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook