Venkaiah Naidu: భోగి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2021, 08:20 AM IST
Venkaiah Naidu: భోగి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

Vice President Venkaiah Naidu celebrates Bhogi with his family | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అందరూ కలిసి భోగి మంటలు వేసి ఆనందోత్సాహాంతో ఒకరినొకరు (Bhogi) శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి రోజున భోగి మంటలు వేయడంతోపాటు, పిల్లలకు బోగిపళ్లు వేసి పెద్దలు ఆశీర్వదిస్తున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. గోవాలోని (Goa) రాజ్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గోవా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి (Venkaiah Naidu ) బుధవారం ఉదయం భోగి మంటలను వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

‘‘భోగి పండుగ శుభాకాంక్షలు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను వదలి సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తాయి. భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ ఉపరాష్ట్రపతి ట్విట్ చేశారు.

Also Read: Turkey: మత ప్రబోధకుడికి 1,075 ఏళ్ల జైలు.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News