Covid 19 Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 21 వేల 411 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 46  మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 997కు పెరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  20 వేల 726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.34 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.13శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.  ఫ్రీ బూస్టర్ ఇస్తుండటంతో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. నిన్న మరో 34 లక్షల 93 వేల  మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 201  కోట్ల 68 లక్షల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.   



Also Read: Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..


Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.