భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా, మహమ్మారి తీవ్రత మాత్రం అధికంగానే ఉంది. కోవిడ్19 మరణాలు మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలుచేస్తుండగా, నేటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటలవరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 (2 కోట్ల 46 లక్షల 84 వేల 77)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో మరోసారి 4,000కు పైగా కరోనా మరణాలు సంభవించాయి. తాజాగా 4,077 మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. దేశ వ్యాప్తంగా కరోనా (CoronaVirus) బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,70,284కి చేరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: PM Kisan Beneficiary List: రైతుల ఖాతాల్లోకి రూ.2000, మీరు లబ్దిదారులేనా, జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి



దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,62,437 మంది కరోనా మహమ్మారిని జయించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,07,95,335 (2 కోట్ల 7 లక్షల 95 వేల 3 వందల 35)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 36 లక్షల 18 వేల 458 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా COVID-19 పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులే 50 వేలు అధికంగా ఉన్నా ప్రాణనష్టం మాత్రమే భారీగానే ఉంది. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల 22 లక్షల 20 వేల 164 మంది కోవిడ్19 టీకాలు తీసుకోగా, పలు రాష్ట్రాల్లో కరోనా టీకాల ఇవ్వడానికి తాత్కాలిక విరామం ఇవ్వడం గమనార్హం 


Also Read: Gold Price Today In India 16 May 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, Silver Price పైపైకి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook