India Corona Cases Updates: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి భారీగా తగ్గింది. ఇటీవల కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్‌, కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన వేరియంట్లలో ఒకటైన డెల్టా కరోనా వేరియంట్ ఉత్పరివర్తనం చెందింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 224 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే స్వల్పంగా కోవిడ్19 కేసులు తగ్గాయి. తాజా కేసులతో కలిపితే ఇండియాలో కరోనా వైరస్ (CoronaVirus) బాధితుల సంఖ్య 2,96,33,105 (2 కోట్ల 96 లక్షల 33 లక్షల 105)కు చేరింది. కోవిడ్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా కరోనాతో పోరాడుతూ 2,542 మంది చనిపోయారు. అయితే ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 3 లక్షల 79 వేల 573కు చేరుకుంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదైనా, వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.


Also Read: Covaxin Vaccine: కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే అంటున్న అమెరికా


మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 1,07,628 మంది కరోనాను జయించారు. దేశంలో ఇప్పటివరకూ 2 కోట్ల 83 లక్షల 88 వేల 100 మంది కోవిడ్19 (Covid-19) నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,65,432కు దిగొచ్చింది. అయితే పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించడం కరోనా థర్డ్ వేవ్‌కు దారితీస్తుందా అనే అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెబుతున్నాయి.


Also Read: Delta Plus Variant Of COVID-19: ఇండియాలో కరోనా కొత్త వేరియంట్, దీని ప్రభావం వివరాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook