India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్దిరోజుల్నించి స్థిరంగా ఉంటోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)సృష్టించిన భయంకర పరిస్థితుల్నించి ఇంకా కోలుకోలేదు. అటు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా..గత కొద్దిరోజుల్నించి కేసుల సంఖ్య స్థిరంగానే ఉంటోంది. 10-15 రోజుల్నించి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 వేలకు అటూ ఇటూ ఉంటోంది. దేశంలో కొనసాగుతున్న అన్‌లాక్ (Unlock)ప్రక్రియ కారణంగా కరోనా సంక్రమణ ఇంకా పూర్తిగా ఆగలేదు. గత 24 గంటల్లో దేశంలో 39 వేల 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 3 కోట్ల 13 లక్షల 32 వేల 159కు చేరుకోగా..24 గంటల్లో 546 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా 4 లక్షల 20 వేల 16 మంది మరణించారు.అటు 35 వేల 87మంది గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 5 లక్షల 3 వేలమంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4 లక్షల 8 వేల 977 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 42.78 కోట్లమందికి పైగా వ్యాక్సిన్(Corona vaccine) అందింది.


Also read: Visakha steelplant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కీలక పరిణామాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook