భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు మాత్రం తగ్గకపోగా, రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 31వేలు దాటగా, 1000 మందికి పైగా మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,897 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో పాటు 73 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం వెల్లడించింది.  కరోనా 6 కొత్త లక్షణాలు..మీకు తెలుసా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,322కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకూ 1,007 మంది మృతిచెందారని వైద్యశాఖ పేర్కొంది. మొత్తం కేసులలో చికిత్స అనంతరం 7,696 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. మహారాష్ట్రలో 8500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అధిక మరణాలు సైతం ఇదే రాష్ట్రంలో సంభవించాయి..  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos