JEE Main April 2021: జేఈఈ మెయిన్ 2021 పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల వాయిదా ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలను వాయిదా వేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెగ్యూలర్ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 27, 28 మరియు 30 తేదీలలో జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా వేగంగా వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో తాజా సెషన్ పరీక్షలను వాయిదా వేస్తూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షల నిర్వహణ తేదీలను 15 రోజుల ముందుగానే ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షల(JEE Main 2021) నిర్వహణపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్‌టీఏ చెబుతోంది. వారి ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.


Also Read: Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు



కాగా, ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ 2021 పరీక్షలను 4 పర్యాయలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలలో రెండు సెషన్ల పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలో మరో రెండు పర్యాయాలు జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా వచ్చిన మార్కులు, పర్సంటైల్‌లో బెస్ట్ స్కోరును జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021(JEE)కు పరిగణనలోకి తీసుకోనున్నామని కేంద్ర విద్యాశాఖ గతంలో వెల్లడించింది.


Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook