JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్

JEE Main Results 2021 Latest News: జాతీయ మీడియాలు రిపోర్ట్ చేసిన మాదిరిగానే జేఈఈ మెయిన్స్ ఫిబ్రవరి పరీక్షా ఫలితాలు(JEE Main 2021 Results) సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది

Written by - Shankar Dukanam | Last Updated : Mar 9, 2021, 09:29 AM IST
JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్

JEE Main 2021 Results : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (JEE Main Result 2021) ఫలితాలు వచ్చేశాయి. పలు జాతీయ మీడియాలు రిపోర్ట్ చేసిన మాదిరిగానే జేఈఈ మెయిన్స్ ఫిబ్రవరి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

ఆరుగురు విద్యార్థులకు 100 పర్సంటైల్ స్కోరు వచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) తెలిపింది. జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షా ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ లో అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. అయితే కేవలం పేపర్ 1 (BE మరియు B.Tech) ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్ 2ఏ మరియు పేపర్ 2బి (B. Arch మరియు B Planning) ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.
లింక్ 1: JEE Main 2021 Results కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లింక్ 2: JEE Main Results 2021 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల మధ్య ఈ ఏడాది తొలి విడత జేఈఈ మెయిన్ 2021 పరీక్షను నిర్వహించింది. మొత్తం 6.52 లక్షల మంది విద్యార్థులు పేపర్ 1 (BE మరియు B.Tech)కు రిజిస్టర్ చేసుకోగా, 5.5 లక్షల మంది జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాల విడుదలకు ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది.

Also Read: JEE Main 2021 Feb Answer Key: జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది, డైరెక్ట్ లింక్ మీకోసం

కాగా, ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2021లో భాగంగా ఫిబ్రవరిలో తొలి పరీక్ష నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలోనూ మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ సైతం ఏర్పాట్లు చేశారు. నాలుగు సెషన్ల పరీక్షలు పూర్తయ్యాక జూన్, జూలై నెలలో కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించడంతో పాటు నెగటివ్ మార్కులను సైతం తొలగించారు. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు విదేశాలలో 9 నగరాలలో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించారు.

Also Read: JEE Main Feb 2021 Final Anwer Key కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News