Kargil Vijay Diwas: జూలై 26.. ఈ తేదీ వచ్చిందంటే దేశభక్తి ఉప్పొంగుతుంది.  దేశభక్తుల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. భారత సైన్యం కీర్తి మహోగ్రంగా కనిపిస్తుంది. జూలై 26న దేశవ్యాప్తంగా  కార్గిల్ విజయ్ దివస్  జరుపుకుంటున్నారు. కార్గిల్‌లో వీర యోధులకు దేశం  నివాళులు అర్పిస్తుది. కార్గిల్ యుద్ధంలో దేశంలోని 527 మంది సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఇందులో హిమాచల్ యుద్ద వీరుల పాత్ర చాలా గొప్పది.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 52 మంది వీరులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేసి 'పహాడ్' లాంటి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. హిమాచల్ సైనికుల త్యాగాలు కార్గిల్ శిఖరాలపై లిఖించబడ్డాయి.హిమాచల్‌ను దేవ్ భూమి అని అలాగే వీర్ భూమి అని కూడా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో సైన్యం యొక్క అత్యున్నత గౌరవమైన రెండు పరమవీర చక్రాలతో సహా అనేక చక్రాలు హిమాచల్ యుద్ధ వీరులకు లభించాయి. కెప్టెన్ విక్రమ్ బాత్రా (మరణానంతరం) మరియు రైఫిల్‌మెన్ సంజయ్ కుమార్‌లకు దేశ అత్యున్నత పతకం పరమవీర చక్ర లభించింది.కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన కెప్టెన్ బిక్రమ్ బాత్రా సాహసం గురించి తెలుసుకుంటే గుండె జలదరిస్తుంది. బాత్రా గర్జనకు శత్రువులు భయపడేవారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా పోరాటానికి దాయాది పాకిస్థాన్ సైన్యం గజగజలాడింది. 1999, జూన్ 1 బాత్రా  బృందం కార్గిల్ యుద్లంలోకి దిగింది. హంప్ , రాకీ నాబ్ స్థానాలను గెలుచుకున్న తరువాత విక్రమ్‌ను  కెప్టెన్‌గా చేశారు.  శ్రీనగర్-లేహ్ మార్గంలోని అతి ముఖ్యమైన 5140 శిఖరాన్ని పాక్ సైన్యం నుండి విడిపించే బాధ్యత కెప్టెన్ విక్రమ్ బాత్రాకు అప్పగించారు. వెళ్లడానికి వీలులైని ప్రాంతం అయినా  విక్రమ్ బాత్రా తన సహచరులతో కలిసి 20 జూన్ 1999 తెల్లవారుజామున 3.30 గంటలకు 5140 శిఖరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ శిఖరం నుంచి రేడియో ద్వారా విక్రమ్ బాత్రా తన విజయ ప్రకటన చెప్పగానే.. ‘దిల్ మాంగే మోర్’ అంటూ సైన్యమే కాదు.. యావత్ భారతావని మార్మోగింది.కార్గిల్ యుద్ధంలో పాలంపూర్‌కు చెందిన కెప్టెన్ సౌరభ్ కాలియా 15 రోజుల పాటు పాక్ సైనికుల చేతిలో బందీగా ఉన్నాడు. ఈ సమయంలో అతను అనేక అమానవీయ హింసలకు గురయ్యాడు.


కార్గిల్ యుద్ధంలో పాలంపూర్‌కు చెందిన కెప్టెన్ సౌరభ్ కాలియా 15 రోజుల పాటు పాక్ సైనికుల చేతిలో బందీగా ఉన్నాడు. ఈ సమయంలో అతను అనేక అమానవీయ హింసలకు గురయ్యాడు.కార్గిల్ యుద్ధంలో 15 మంది కాంగ్రా సైనికులు ప్రాణత్యాగం చేశారు ప్రాణత్యాగం చేసిన హిమాచల్ రాష్ట్రానికి చెందిన 54 మంది జవాన్లలో, కాంగ్రా జిల్లా నుండి 15 మంది, జిల్లా మండి నుండి 10 మంది మరియు హమీర్‌పూర్ నుండి 8 మందిని చేర్చారు. కార్గిల్ ఆపరేషన్‌లో చొరబాటుదారులను తరిమికొట్టడంలో గ్రెనేడియర్లు సుర్జిత్ సింగ్ డెహ్రా మరియు నాయక్ పద్మాసింగ్ ఇండోరాకు చెందినవారు.కెప్టెన్ విక్రమ్ బాత్రా, పాలంపూర్ నుండి కెప్టెన్ సౌరభ్ కాలియా, డెహ్రా నుండి గ్రెనేడియర్ విజేంద్ర సింగ్, నగ్రోటా నుండి నాయక్ బ్రహ్మదాస్, గోపాల్‌పూర్ నుండి రైఫిల్‌మెన్ రాకేష్ కుమార్, జవాలి నుండి రైఫిల్‌మెన్ అశోక్ కుమార్ మరియు నాయక్ వీర్ సింగ్, నాయక్ లఖ్వీర్ సింగ్, రైఫిల్‌మ్యాన్ సంతోష్ సింగ్ ఎన్ జగ్‌పూర్ మరియు రైఫిల్‌మెన్ నుండి, హవల్దార్ సురేంద్ర సింగ్, జవాలి నుండి గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్, ధర్మశాల నుండి రైఫిల్‌మ్యాన్ జంగ్ మహత్ ఉన్నారు. 


కార్గిల్ యుద్ధం 1999 మే 3 నుంచి జులై 26 వరకు జరిగింది. కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ వెంబడి  60 రోజుల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధంలో భారత్ జయభేరి మ్రోగించింది. కార్గిల్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌కు ఉమ్మడి రాజధాని. 1999 మేలో పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు కార్గిల్ ద్వారా భారత భూ భాగంలోకి అడుగు పెట్టారు. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు భారత సైన్యం తమ పరాక్రమాన్నిరుచి చూపించింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో కార్గిల్ ఆపరేషన్ చేపట్టిన భారత ఆర్మీ.. పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టింది. కార్గిల్ యుద్ధం జూలై 26న ముగిసింది.1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరుపుతున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్  విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. 


Read also: EPF Money Interesting Facts: ఈపీఎఫ్ ఫండ్‌ని బ్యాంకులు, కోర్టులు అప్పు కింద అటాచ్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?


Read also: Thyroid Control Tips: థైరాయిడ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేసే సూపర్ ఫుడ్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి