లోక్ సభ ఎన్నికలు లైవ్ అప్‌డేట్స్: భారీ భద్రత మధ్య ప్రారంభమైన 6వ విడత పోలింగ్

Sun, 12 May 2019-12:40 pm,

గత ఐదు విడతల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలు, అనుభవాల దృష్ట్యా ఈసారి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 6వ విడత పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు  ప్రారంభమైంది. గత ఐదు విడతల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలు, అనుభవాల దృష్ట్యా ఈసారి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, బీహార్‌లో 9 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలు, ఢిల్లీలో 7 స్థానాలు, జార్ఖండ్‌లో 4 లోక్ సభ స్థానాలకు నేడే ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని అన్ని ఏడు లోక్ సభ స్థానాలకు నేడే పోలింగ్ జరగనుంది.

Latest Updates

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link