ఎన్సీపి  ( Nationalist  Congress Party )  నేత శరద్ పవార్  ( Sharad Pawar )కు  పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ఒక పోలీసు పైలట్ వాహనం ఉదయం 9.30 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం ముంబై -  పుణే ఎక్స్‌ప్రెస్ వేలో ఖండాలా వద్ద జరిగింది. శరత్ పవార్ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలో ఒక కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అయితే అప్పటికే శరద్ పవార్ వాహనం ముందుకు వెళ్లిపోయింది.  Also Read : హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ ప్రమాదంలో పోలీసు వాహనాన్ని నడిపిస్తున్న డ్రైవర్‌తో పాటు కొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.