కరోనా అంతం కావంటూ నరబలి ఇచ్చిన అర్చకుడు
ఒడిశాలోని కటక్‌ జిల్లా నర్సింగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ నుంచి గ్రామానికి విముక్తి కల్పిస్తానని గ్రామస్తులను నమ్మబలికి ఆలయ పూజారి ఓ వ్యక్తిని నరబలి ఇవ్వడం కలకం రేపుతోంది. దేవుడ్ని సంతృప్తి పరిస్తే గ్రామంలోకి ఏ వైరస్‌ రాదని ప్రచారం చేసి నమ్మించాడు అర్చకుడు. చివరికి ఓ వ్యక్తిని నరబలి ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూరజ్‌ కుమార్‌ ప్రధాన్‌ అనే దాదాపు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని స్థానిక బ్రాహ్మణిదేవి ఆలయంలో అత్యంత రహస్యంగా నరబలి ఇచ్చాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నరబలి ఇచ్చిన అర్చకుడు సంసారి హోజాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. (Image Credit:odishatv)  బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన 


గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడం గ్రామస్తులను కలవరానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను తరిమి కొట్టేందుకు ఓ ఉపాయం ఆలోచంచానని పూజారి సంసారి హోజా స్థానికులను నమ్మించాడు. అయితే నరబలి లాంటివి చేస్తాడని ప్రజలు ఊహించలేదు. స్థానిక బ్రాహ్మణి దేవి ఆలయంలో ఓ వ్యక్తిని నరబలి తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి