PM Narendra Modi visits bharat biotech company: హైదరాబాద్: ఫార్మ దిగ్గజం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అభినందించారు. భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ స్వదేశీ ప‌రిజ్ఞానంతో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోందని మోదీ పేర్కొన్నారు. కోవిడ్-19 ను అరికట్టకేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు తనకు వివరించారని మోదీ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల ఆయన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తూ మోదీ సందర్శన అనంతరం ట్వీట్ చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు అహ్మ‌దాబాద్ నుంచి నరేంద్ర మోదీ మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. సుమారు గంట సేపు భార‌త్‌బ‌యోటెక్ సంస్థ‌ శాస్త్రవేత్తలతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ ఎల్లాతో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌ల‌తో ప్ర‌ధాని మోదీ వ్యాక్సిన్ పురోగ‌తి గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా హాకీంపేట్ చేరుకున్న ప్రధానికి డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీఎం సోమేశ్ కుమార్‌ స్వాగ‌తం ప‌లికారు. Also read: Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్


అయితే అంతకుముందు ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం పుణే బయల్దేరారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ పురోగతిని సాయంత్రం సమీక్షిస్తారు. 


Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!


Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe