Pulwama Attack Black Day: సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున (2019 ఫిబ్రవరి 14) జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాడు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"2019లో ఇదే రోజున పుల్వామాలో అమరులైన జవాన్లకు నా నివాళులు అర్పిస్తున్నాను. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను నేను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది" అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 



2019 ఫిబ్రవరి 14న పుల్వామా మీదుగా వెళ్తున్న సీఆర్పీఆఫ్ వాహానాన్ని టార్గెట్ చేసుకొని ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాశారు. పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్​ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్​లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్​ స్ట్రైక్​ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  


Also Read: Chinese Apps Ban: చైనాకు భారత్ షాక్... మరో 54 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం..!


Also Read: ISRO C52: విజయవంతంగా పీఎస్ఎల్‌వి సి 52, ఆ మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook