చెన్నైలోని ఆర్కే నగర్ లో డిసెంబర్ 21న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.  జయ మృతి చెందినప్పటి నుంచి ఆర్కే నగర్ స్థానం ఖాళీగా ఉంది. తాజాగా విడుదలైన ఉపఎన్నిక షెడ్యూల్ ను అనుసరించి డిసెంబర్ 21వ తేదీ ఎన్నిక జరుగుతుంది. డిసెంబర్ 24వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైతాయి. ఆర్కే నగర్ తో పాటు పశ్చిమ బెంగాల్ లోని సబంగ్, ఉత్తర ప్రదేశ్ లోని సికంద్రా , అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కే కసాంగ్, ళికబళి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.