భోపాల్ : అయోధ్యలో అద్భుతమైన రామ్ మందిర్  నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ రామ్ మందిర్ నిర్మాణంపై చేసిన వ్యాఖలపై అమిత్ షా తీవ్రంగా ఖండించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామ్ మందిర్ ఆపేయాలంటూ కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై  అమిత్ షా స్పందిస్తూ.. సోదరా..  మీరు ఎంత వ్యతిరేకించాలనుకుంటున్నారో వ్యతిరేకించండి. మేము మాత్రం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. 


దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 నిరసన ప్రదర్శనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలకు .. విధ్వంసానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీకి మూల్యం చెల్లించుకునే రోజులు ఆసన్నమయ్యాయన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..