న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనా కాదా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుందని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు.. అక్టోబర్ నుంచి దీనిపై విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది.