Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడురోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మరో ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి మరికొన్ని చోట్ల ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


రాగల మూడురోజులపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉపరితల ద్రోణి ప్రభావం అధికంగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వర్షాలు పడతాయని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.


Also read:తరాలకు సరిపడా సంపాదించుకున్నాం.. రుణం తీర్చుకోకపోతే ఎలా.. సొంత పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ 


Also read:Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.