Uttarakhand BJP MLA passes away: న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఈ కరోనా మహమ్మారి బీజేపీ (BJP) ఎమ్మెల్యే ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ జీనా (50) (Surendra Singh Jeena) కరోనావైరస్‌ మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ రావటంతో ఆయన ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో.. బుధవారం రాత్రి సురేంద్ర సింగ్ జీనా తుదిశ్వాస విడిచారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన భార్య ధర్మాదేవి కూడా గుండెపోటుతో మరణించారు. ఆమె మరణించిన అనతి కాలంలోనే ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కూడా కరోనా కన్నుమూశారు. Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1969 డిసెంబర్‌ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో సురేంద్ర సింగ్‌ జీనా జన్మించారు. ఆయన ప్రస్తుతం అల్మోరా జిల్లా స్టాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. మొదటిసారి ఆయన బిక్యాసేన్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. ఆ తర్వాత స్టాల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  Also read: Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు


 


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe