DA Hike News: ఉద్యోగులకు శుభవార్త, ఇవాళ్టి కేబినెట్ భేటీలో 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్

Wed, 16 Oct 2024-11:42 am,

జూలై నుంచి అక్టోబర్ వరకూ మొత్తం డీఏ ఎరియర్లతో కలిపి అక్టోబర్ జీతం అందుకోనున్నారు. దాంతో ఈ నెల జీతం భారీగానే ఉండనుంది. మరోవైపు దీపావళి పురస్కరించుకుని బోనస్ కూడా ఈనెల జీతంతోనే అందవచ్చు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో పెరగాల్సిన డీఏ పెంపుపై ఇవాళ ప్రకటన వెలువడనుంది. ఈసారి డీఏ 3 శాతంకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 18 వేల రూపాయలు కనీస వేతనం ఉంటే 540 రూపాయలు డీఏ పెరగనుంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై ఇవాళ ప్రకటన వెలువడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. 

7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. జూలై నెలలో పెంచాల్సిన డీఏ పెంపుపై నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి డీఏ 3 శాతం పెంపుకు ఆమోదం తెలుపనున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link