Mega Family: మెగా ఇంట మొదలైన మెగా సంబరాలు.. మరొక మెగా వారసుడు రాబోతున్నాడా?

Mon, 07 Oct 2024-6:02 pm,

మెగా హీరో వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల జంట కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పుకోవచ్చు. చూడముచ్చటగా ఉండే ఈ జంట గత ఏడాది ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

2017లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ అనే సినిమా షూటింగ్ సెట్స్ మీద మొదటిసారిగా.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలుసుకున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కానీ చాలా కాలం ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచారు.   

గత ఏడాది జూన్ లో జరిగిన వీరి నిశ్చితార్థం తర్వాతే.. వీరి ప్రేమ గురించి క్లారిటీ వచ్చింది. అదే ఏడాది నవంబర్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి జరిగింది. కానీ ఇండియా తిరిగి వచ్చాక.. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ పిలిచి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

తాజాగా ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా లావణ్య త్రిపాఠి గర్భవతి అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా వెకేషన్ లో ఉన్న ఈ జంట ఫోటోలలో కూడా.. లావణ్య త్రిపాఠిను చూసి ఆమె కచ్చితంగా గర్భవతి అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో మెగా ఇంటా మరొక వారసుడు లేదా వారసురాలు.. రాబోతుంది అని మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ జంట కి శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. మరోవైపు పెళ్లి తర్వాత సినిమాలకి కొంచెం దూరంగా ఉంటోంది లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link