Tillu Square: అందం డోస్ పెంచేసిన టిల్లు భామలు.. చీరల్లో చందమామలాగా…

Tue, 09 Apr 2024-8:40 pm,

2020 లో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ సినిమా డీజే టిల్లు అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అందులో ముఖ్యంగా రాధికా క్యారెక్టర్ లో నేహా శెట్టి అదరగొట్టింది  

ఇక ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈ మధ్యనే విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా మరింత విజయం సాధించి అందరి దృష్టిని ఆకట్టుతుంది..  

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించడం విశేషం. అయితే కొన్ని సన్నివేశాల్లో మొదటి పార్ట్ హీరోయిన్ నేహా శెట్టి కూడా మరోసారి రాధికా పాత్రలో కనిపించి మరింత మెప్పించింది  

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న ఘనంగా జరగగా.. ఈ ఇద్దరు హీరోయిన్స్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయ్యి అందరిని ఆకట్టుకున్నారు.

అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ చీరలో మల్లెపూలు పెట్టుకొని అందంగా కనిపివ్వగా.. నేహా శెట్టి స్కై బ్లూ చీరలో ఆకాశంలోని చందమామను మైమరిపిచ్చేలా కనిపించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link