Eluru Incident: ఏలూరు ఆసుపత్రిలో వింతవ్యాధి బాధితుల్ని పరామర్శించిన వైఎస్ జగన్

Mon, 07 Dec 2020-11:29 am,

ఏలూరు ఘటనపై పరీక్షల కోసం ప్రత్యేక నిపుణుల బృందం ఏలూరుకు రానుంది. అటు కేంద్రం కూడా ఈ ఘటనపై స్పందించి..సహాయం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఏలూరు వింతవ్యాధి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి ఆళ్లనాని, వైద్యాధికార్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్వస్థతకు దారితీసిన పరిస్థితులపై పరీక్షల చేసి కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.

బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

జడ్పీ సమావేశంలో సమీక్ష అనంతరం దేవరపల్లికి చేరుకుని..గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికార్లతో సమీక్ష నిర్వహించనున్నారు వైఎస్ జగన్.

బాధితులకు భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దంటూ ధైర్యం కల్పించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link