Curd side effects: పెరుగు హెల్త్ కు మంచిదే.. కానీ వీటితో కలిపి తింటే మాత్రం యమడేంజర్.. డిటెయిల్స్ మీకోసం..

Sun, 12 May 2024-9:18 pm,

పెరుగును దోసకాయలతో కలిపి చాలా మంది తింటుంటారు. దోసకాయ, పొట్లాకాయలతో చట్నీలు కూడా చేసుకుంటారు. కానీ ఈ కాంబినేషన్ లో అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.  

సాధారణంగా కొందరు స్పైసీ ఫుడ్ లను, పెరుగుతో కలిపి తింటారు. కారంగా,మంటగా అన్పించగానే వెంటనే పెరుగు వేసుకుని లాగించేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడని, దీని వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా పాడౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగు పాల నుంచి వస్తుంది. పాలను తోడువేస్తే పెరుగు అవుతుంది. కానీ పెరుగును, పాలను ఒకేసారి కలిపి తినకూడదంట. పొరపాటున ఇలాతింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడుతుందంట. అందుకే ఇలా తినొద్దని చెబుతుంటారు.  

వేడి వేడి పదార్థాలు తినేటప్పుడు వెంటనే చల్లగా మారిపోవాలని, కొందరు పెరుగుతో కలిపితింటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అందుకే పదార్థాలు చల్లగా మారిన తర్వాత మాత్రమే పెరుగును కలిపి తినాలంట.  

పుచ్చకాయలను, కొందరు పెరుగుతో కలిపి తింటుంటారు. ఈ రెండు పదార్థాలు కూడా పరస్పరం భిన్నమైన గుణాలు కల్గి ఉంటాయంట. అందుకే వాటర్ మిలన్ ను పెరుగుతో అస్సలు తినకూడని చెబుతున్నారు.

ఇక నూడుల్స్, స్పైసీ ఫుడ్ లతో పెరుగును అస్సలు తినకూడదు. ఇలా చేస్తే, కడుపులో అజీర్తిగా మారిపోతుంది. తిన్న పదార్థాలు అరగక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. కొందరిలో మలబద్దకం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.  Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link