Delhi Red Fort: ఢిల్లీ ఎర్రకోట అసలు రంగు ఇది కాదా, రంగు ఎవరు, ఎందుకు మార్చారు

Thu, 20 Jul 2023-12:33 am,

ఎర్రకోటను కిలా ఎ ముబారక్ అని కూడా పిలుస్తారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ముబారక్ కోటగా కూడా పిలిచేవారు. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన తాత అక్బర్‌కు గుర్తుగా ఆగ్రా రెడ్ ఫోర్ట్  స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ ఎర్రకోటను నిర్మించాడు.

ఢిల్లీ ఎర్రకోటను సున్నపురాయితో నిర్మించారు. దీని రంగు తెలుపు. కానీ వాతావరణం కారణంగా పాడవుతుండటంతో ఆంగ్లేయులు తెలుపురంగు నుంచి ఎర్రరంగుకు మార్చారు. 

1858 సిపాయిల తిరుగుబాటు తరువాత ఆంగ్లేయులు ఆక్రమించారు ఈ కోటను. ఇండియాకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఈ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయడం ప్రారంభించారు. 2007లో యునెస్కో ఈ కోటను ప్రపంచ హెరిటేజ్ సంపదగా గుర్తించింది.

యమునా నది ఒడ్డున నిర్మితమైంది ఢిల్లీ ఎర్రకోట. షాజహాన్ కంటే ముందు మొఘల్ చక్రవర్తులు ఆగ్రా రాజధానిగా పాలించేవారు. కానీ షాజహాన్ రాజధానిని ఆగ్రా నంచి ఢిల్లీకు మార్చాడు.

ఢిల్లీ ఎర్రకోట ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు వేదిక, నిలువెత్తు సాక్ష్యం. ఈ కోటకు రక్తం చిందించిన చరిత్ర ఉంది. ఫరూఖ్ షియర్ నుంచి బహదూర్ షాహ్ జాఫర్ పాలన వరకూ చాలా ఘటనలకు కేంద్రంగా నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link