IRCTC Tour Packages: ఐఆర్‌సీటీసీ సరికొత్త ఆఫర్.. తక్కువ బడ్జెట్‌లో ఈ ప్రాంతాలను చూసేయండి

Sun, 19 Mar 2023-2:36 pm,

ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ పేరు జన్నత్ ఈ కాశ్మీర్. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తారు. ఈ టూర్‌లో స్థానిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రయాణికులకు వాహన సౌకర్యం కూడా కల్పిస్తుంది ఐఆర్‌సీటీసీ.  

ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులు శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ బడ్జెట్‌లో కాశ్మీర్ మైదానాల్లో ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు వసతి, భోజన ఏర్పాట్లు ఉచితంగా ఉంటాయి.  

ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.  

ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణించేందుకు రూ.60,100 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అయితే.. మీరు ఒక్కొక్కరికి రూ.44,900 చెల్లించాలి. ముగ్గురితో కలిసి ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి రూ.44,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  

ఈ టూర్ ప్యాకేజీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాడనికి మీరు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? ఏయే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link