Janhvi Kapoor: ఎన్టీఆర్, చరణ్ ల తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ..

Sun, 07 Jul 2024-5:55 am,

జాన్వీ క‌థానాయిక‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు అర పుష్కరం పూర్త కావొచ్చినా.. కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర రెండు పార్టులతో పాటు రామ్ చరణ్‌ తో RC 16 సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటడం పక్కా అని చెబుతున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో తాకర్,  చ‌ర‌ణ్ హీరోలుగా  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో  గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకన్నారు. అందుకే ఈ హీరోల సినిమాల‌తో జాన్వీ టాప్ హీరోయిన్ గా స‌త్తా చాటడం ప‌క్కా అని శ్రీదేవి అభిమానులు చెబుతున్నారు.

తొలి సినిమా 'ధడక్‌' చిత్రంతో  సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన  జాన్వీకపూర్.. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి స‌క్సెస్ అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ మూవీలు ఓటీటీ వేదిక‌గానే సంద‌డి చేశాయి.

జాన్వీ కపూర్.. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

మరోవైపు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో కూడా ఈ భామనే  కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం.

 

మొత్తంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలతో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాడం గ్యారంటీ అన చెప్పొచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link