Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Wed, 01 May 2024-8:07 pm,

రామ్ హీరోగా చేసిన నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాలో కీర్తి సురేష్ ని చూసి ఎంతోమంది విమర్శలు చేశారు.

అసలు ఈ హీరోయిన్ కి నటన వచ్చా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలు అన్నీ కూడా తన మహానటి సినిమాతో క్లియర్ చేసింది కీర్తి సురేష్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది. ఆ పాత్ర కీర్తి సురేష్ తప్ప ఎవ్వరూ చేయలేరు అన్నంత పేరు తెచ్చుకుంది.

మహానటి సినిమాకి నంది అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరస అవకాశాలు అందుకుంటూ త్వరలో నార్త్ ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ క్రమంలో కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డాన్స్ వేస్తూ పింక్ డ్రెస్సులు కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు కొన్ని అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link