Kichcha sudeep: దర్శన్ పై హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కిచ్చా సుదీప్..

Mon, 17 Jun 2024-4:12 pm,

కర్ణాటకలో రేణుక స్వామి అనే ఫ్యాన్ ను.. దర్శన్, పవిత్ర గౌడ్ లు కలిసి అత్యంత దారుణాంగా చంపారని విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 16 మంది వరకు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో కోర్టు వీరికి పోలీసులకు కస్టడీకీ అప్పగించింది.. 

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తాజాగా.. కన్నడ హీరో సుదీప్ తీవ్రంగా స్పందించాడు. రేణుక స్వామి భార్యకు,పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఘటన జరక్కుండా ఉండాల్సింది అని.. దీని వెనకాల ఎంతటి వారున్న కూడా చర్యలు తీసుకొవాలని పోలీసులను కోరాడు.

ఒకరిద్దరు చేసిన తప్పులను ఇండస్ట్రీకి ఆపాదించోద్దని హీరో సుదీప్ కోరారు.  ఆల్రేడీ పెళ్లి జరిగిన కూడా.. పదేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు అనేక మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయినట్లు సుదీప్ పేర్కొన్నారు. రేణుక స్వామికి జస్టిస్ జరగాలన్నదే తమ డిమాండ్ అన్నారు.

ఇక రేణుక స్వామిని చిత్రదుర్గ్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, బెంగళూరులో చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు విచారణలో బైటపడింది. తాను.. వెజీటెరియన అన్న కూడా.. చికెన్ బిర్యానీ నోట్లో కుక్కి మరీ కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చారని విచారణలో బైటపడింది. 

దర్శన్ తూగుదీప.. తాను రెండు దెబ్బలు మాత్రమే కొట్టానని , ఆ తర్వాత ఏంజరిగిందో తెలియదని కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. పవిత్ర గౌడ.. ఈ విషయం, దర్శన్ కు చెప్పకపోతే.. ఈ ఘోరం జరిగేది కాదంటూ పోలీసులు ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన ఇప్పుడు కన్నడ నాట తీవ్ర దుమారంగా మారింది.

ప్రస్తుతం వీరి విచారణ కొనసాగుతుంది. పోలీసులు అనేక టెక్నికల్ డాటాలను సంపాదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రేణుక స్వామిని, పవిత్ర గౌడతో చెప్పుతో కొట్టినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link