Muslim Population: వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా, భవిష్యత్తులో ఇండోనేషియాను దాటనున్న ఇండియా

Sat, 01 Jun 2024-1:20 pm,

ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం

ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత భారీ సంఖ్యలో ముస్లింలు ఉండేది ఆసియా దేశాల్లోనే. మొత్తం ప్రపంచంలో ఉండే ముస్లింలలో 61 శాతం ఆసియా ప్రాంతంలోనే ఉన్నారు.

మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా

ప్యూ రీసెర్ట్ రిపోర్ట్ ప్రకారం మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం 19.8 శాతం మంది ముస్లింలున్నారు. సహారా ఎడారి పరిసర ప్రాంతాల్లో ఆఫ్రికాలో 15 శాతం ఉన్నారు. యూరప్ దేశాల్లో 3 శాతం ఉన్నారు. 

ప్రపంచ ముస్లిం జనాభా  1 బిలియన్ 80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా 2 బిలియన్ల 40 కోట్లు, రెండో స్థానంలో ఉన్న ముస్లింల జనాభా 1 బిలియన్ 80 కోట్లు. భవిష్యత్తులో ముస్లింలు మొదటి స్థానంలో వచ్చేయవచ్చు

క్రైస్తవ దేశాల్లో తగ్గుతున్న జననాలు

క్రైస్తవ దేశాల్లో జననాల రేటు పడిపోతోంది. ఫలితంగా 2025 వరకూ క్రైసవుల జనాభాలో 35 శాతం పెరుగుతుంది. అదే ముస్లింల జనాభా 73 శాతం చొప్పున పెరుగుతుంది.

2070 నాటికి ఇస్లాం అతి పెద్ద మతం

ఈ అధ్యయనం ప్రకారం 2070 నాటికి క్రైస్తవమతాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవతరించనుంది. 

ముస్లిం జనాభాలో మొదటి స్థానంలో ఇండోనేషియా

ప్రపంచంలో ముస్లిం దేశాల గురించి పరిశీలిస్తకే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో పాకిస్తాన్, మూడో స్థానంలో ఇండియా ఉంది. సౌదీ అరేబియా కూడా ముస్లింలకు అతి పెద్ద ప్రాంతం.

అతిపెద్ద ముస్లిం దేశంగా పాకిస్తాన్

ఈ అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో రానున్న 26 ఏళ్లలు ప్రపంచంలో చాలా మార్పులు రానున్నాయి. 2030 వరకూ ఇండోనేషియాను దాటి పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది. 

అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండియా

ప్యూ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ముస్లింల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి పాకిస్తాన్‌ను దాటి ఇండియా అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link