NTR31: జూ.ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్.. ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..!

Wed, 02 Oct 2024-11:17 pm,

ప్రశాంత్ నీల్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయాలు అవసరం లేదు. కే జి ఎఫ్ సినిమాతో.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ డైరెక్టర్. కాగా ఈ డైరెక్టే తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. సెన్సేషనల్ హీరోయిన్ రుక్మిణి వసంత్. 

ప్రశాంత్ నీల్ కే.జి.ఎఫ్ సినిమా తరువాత.. ప్రభాస్ తో తీసిన సలార్ అయితే మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ చిత్రం తరువాత మరలా తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ తో.. చేతులు కలిపారు ఈ దర్శకుడు. 

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెన్సేషనల్ విజయం సాధించడంతో.. జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులే కాకుండా.. అన్ని భాషల వారు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.. రుక్మిణి వసంత్.

శాండల్ వుడ్‌లో ఈమధ్య బాగా వినిపిస్తోన్న పేరు రుక్మిణి వసంత్. సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ A సినిమాతో ఈ హీరోయిన్ మంచి పేరు తెచ్చుకుంది. దాని సీక్వెల్‌ గా వచ్చిన సైడ్ బి లో కూడా తన అద్భుతమైన నటన చూపించి అందరిని ఆకట్టుకుంది.

ఈ చిత్రం తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో.. విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద పేరు రాకపోయినా రుక్మిణ వాసంత్ కి మాత్రం అభిమానులు వచ్చారు.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ తమిళంలో కూడా నటిస్తోంది. శివకార్తికేయన్‌తో కలిసి త్వరలోనే స్క్రీన్ షేర్ చేసుకోనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో సైతం డెబ్యూ ఇవ్వనుంది. అది కూడా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో. ఈ విషయం తెలిసి ఈమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link