PUBG app in India: పబ్‌జి ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్

Sun, 29 Nov 2020-4:41 am,

పబ్‌జి యాప్ లాంటి వ్యాపారాలపై ఒకసారి నిషేధం విధించాకా పేరు మార్చి మళ్లీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తామంటే ఎలా కుదురుతుందని కేంద్ర సాంకేతిక సమాచార శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

అలా అయితే టిక్ టాక్ లాంటి యాప్స్ నిర్వాహకులు కూడా అదే పని చేస్తారు. ఒక యాప్‌ని నిషేధించాకా.. మరోపేరుతో వస్తామంటే అందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా అని అభిప్రాయపడిన సదరు అధికారి.  

పబ్‌‌జి మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ( PUBG India Private Limited ) పేరుతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద ఓ వ్యాపార సంస్థ తమ పేరు నమోదు చేసుకున్నట్టు మీడియాలోనూ వార్తలొచ్చాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు పొందుపర్చినట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నాయి.

దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 118 చైనా యాప్స్‌పై ( China apps banned in India ) కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అందులో పబ్‌జి కూడా ఒకటి. అప్పటి నుంచే పబ్‌జి యాప్‌తో పాటు పబ్‌జి ప్రియుల ఆట కట్టించినట్టయింది.

భారత్‌లో 100 మిలియన్ డాలర్స్ పెట్టుబడులతో భారతీయతతో పబ్‌జిని మళ్లీ భారత్‌లో ప్రవేశపెడుతామని గతంలోనే పబ్‌జి కార్పొరేషన్ ప్రకటించింది.

సౌత్ కొరియాకు చెందిన తమ పేరెంట్ కంపెనీతో కలిసి భారత్‌లో వీడియో గేమ్స్, ఈస్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, ఐటి రంగాల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పబ్‌జి కార్పొరేషన్ అప్పట్లో పేర్కొంది.

పబ్‌జి లాంటి యాప్స్‌పై భారత్ నిషేధం విధించినప్పటికీ.. దేశ భక్తితో సంబంధం లేకుండా పబ్‌జి లాంటి చైనా యాప్స్‌కే అలవాటుపడిన యువతకు ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ కానుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link